చెన్నై: ఐపీఎల్ 2019 సీజన్లో మొదట ప్లే ఆఫ్కు చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డు సృష్టించింది. మంగళవారం రాత్రి సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంతో చైన్నై ఖాతాలో 16 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో ప్లే ఆఫ్కు చేరిన మొదటి జట్టుగా చైన్నై రికార్డు సృష్టించింది. అయితే ఇది అధికారంగా ధృవీకరించాల్సి ఉంది. చేలరేడి ఆడిన వాట్సన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.