న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ కారు ఆల్టోలో సరికొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.93 లక్షలు కాగా గరిష్ట ధర రూ.3.71 లక్షలు.ఎంట్రీ లెవెల్ విభాగంలో బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిన తొలి కారు ఇదేనని మారుతీ సుజుకీ ఇండియా పేర్కొంది. ఈ కారు లీటరుకు 22.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని తెలిపింది. యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్, డ్రైవర్ ఎయిర్బ్యాగ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి పలు ఫీచర్లతో ఆల్టోను అప్డేట్ చేశామని వివరించింది. కొత్త ఆల్టో 800 మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లు అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.2.93 లక్షలు, రూ.3.5 లక్షలు, రూ.3.71 లక్షలుగా ఉంది. ఇకపోతే ఈ మోడల్ ధర ఇదివరకు రూ.2.63 లక్షల నుంచి ప్రారంభమయ్యేది.