చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను ఇండియాలో నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాప్ పై పెట్టుబడులు పెట్టిన చైనాకు చెందిన బైట్డాన్స్ టెక్నాలజీస్ మాత్రం రోజుకు 5,00,000 డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.3.5 కోట్లు) ఆదాయం కోల్పోతోంది. రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే 250 ఉద్యోగాలు రిస్క్లో ఉన్నాయని పేర్కొంది. టిక్ టాక్ ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. అలాగే గూగుల్ ప్లేస్టోర్లో టాప్ డౌన్లోడ్స్ యాప్లో ఇది టాప్లో ఉంది. భారత్లో దాదాపు 30 కోట్ల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో లేదు. ముఖ్యంగా పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా టిక్ టాక్ ఉందని ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యాప్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్న బైట్డాన్స్ సంస్థకు టిక్ టాక్ బ్యాన్ శరాఘాతమనే చెప్పవచ్చు.