వయనాడ్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఆ స్థానం నుంచి తుషార్ వెల్లపల్లి ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. వయనాడ్ నియోజకవర్గంలో ఇవాళ కొన్ని చోట్ల ఈవిఎంల మొరాయింపు లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్ధి తుషార్…రీపోలింగ్కు డిమాండ్ చేశారు. ముప్పనాడ్ పంచాయితీలోని ఓ స్కూల్లో ఉన్న ఈవిఎం మొరాయించిందని, రెండు సార్లు బటన్ నొక్కినా ఓటు పడడంలేదని తుషార్ ఆరోపించారు.