ఎన్నికల బరిలోకి గౌతం గంభీర్

SMTV Desk 2019-04-23 13:16:57  Gautham Gambhir,

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎన్నికల బరిలోకి దిగాడు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం టికెట్‌ను బీజేపీ అధిష్ఠానం అతనికి కేటాయించింది. సిట్టింగ్ ఎంపీ మహేశ్ గిరి స్థానంలో బరిలోకి దిగిన గంభీర్ కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషిలను ఎదుర్కోనున్నాడు. అయితే ఢిల్లీలోని ఏడు స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

కాగా, ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నలుగురు సిట్టింగులకు తిరిగి టికెట్లు కేటాయించింది. కాగా, ఏడో స్థానమైన నార్త్-వెస్ట్ (వాయవ్య) ఢిల్లీ నియోజకవర్గానికి బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడింటికి ఏడు స్థానాలనూ కైవసం చేసుకుంది. ఇక ఈ సారి కూడా అదే టార్గెట్ పెట్టుకుని బీజేపీ ఎన్నికల రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే గంభీర్‌ని బరిలో దించడం వలన ఆ ప్రభావం మిగతా స్థానాలపై కూడా ఉంటుందని భావిస్తున్నారు.