కొలంబో: శ్రీలంకలో ఆదివారం ఉదయం ప్రారంభం అయిన బాంబు దాడులు ఇప్పటికి ఆగలేదు. తాజాగా కొలంబోలోని మరో చర్చి వద్ద పేలుడు సంభవించింది. చర్చి వద్ద పేలుడు జరిగింది. చర్చి వద్ద ఆగి ఉన్న వ్యానులో బాంబు ఉందని తెలిసి దాన్ని ప్రత్యేక టాస్క్ఫోర్స్ దళాలు నిర్వీర్యం చేసేలోపు అది ఒక్కసారిగా పేలింది. ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిని దారుణ కాండతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తుంది. ఇప్పటికే విమానాశ్రయం వద్ద ముష్కరులు అమర్చిన బాంబులను గుర్తించి పోలీసులు నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కొలంబోలోని ప్రధాన బస్టాండులో 87 డిటోనేటర్లను గుర్తించారు. సమయానికి గుర్తించిపోయి ఉండకపోతే మరో దారుణం జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు.