ఢిల్లీలో ఒంటరి పోరుకు సిద్దం

SMTV Desk 2019-04-22 15:16:17  new delhi, loksabha elections, congress party

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకు సిద్దమయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏడు స్థానాలకు గాను ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ నుంచి పోటీ చేస్తుండగా న్యూఢిల్లీ నుంచి అజయ్‌ మాకెన్‌ బరిలోకి దిగుతున్నారు. ఇక చాందినీ చౌక్‌ నుంచి జేపీ అగర్వాల్‌, ఈస్ట్‌ ఢిల్లీ నుంచి అర్విందర్‌ సింగ్‌ లవ్‌లీ పోటీ చేస్తున్నారు. నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ నుంచి రాజేశ్‌ లీలోతియా, వెస్ట్‌ ఢిల్లీ నుంచి మహబాల్‌ మిశ్రా పేర్లను ప్రకటించింది కాంగ్రెస్‌. మిగిలిన ఒక్క స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే నార్త్‌ ఈస్ట్‌ నుంచి పోటీ చేస్తున్న షీలా దీక్షిత్‌..అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటున్నారు.