రాయ్ పూర్: ఆదివారం బీజాపూర్ పోలీసులుకు 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మూడు రైఫిళ్లను కూడా పోలీసులకు మావోయిస్టులు అప్పజెప్పారు. లొంగిపోయిన మహిళల్లో ఒకరిపై రూ. లక్ష రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆవిడ నక్సల్ చేతన నాట్య మండలి కమాండర్గా వ్యవహరిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులందరికి ప్రభుత్వం తరఫున సాయం చేసి..ఉపాధి కల్పిస్తామని పోలీసులు పేర్కొన్నారు.