రేపు లడక్ కు వెళ్లనున్న భారత ఆర్మీ చీఫ్‌

SMTV Desk 2017-08-19 18:20:22  China, India, Indian army chief, ladakh, China media

న్యూఢిల్లీ, ఆగస్ట్ 19: భారత్-చైనాల మధ్య రోజురోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ నేపధ్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు చైనా ఆర్మీ లడక్ ప్రాంతంలోని పాంగాంగ్ సరస్సు దగ్గరకు చొరబడింది, దీంతో ఇరు దేశాల ఆర్మీ రాళ్లదాడి దిగాయి. ఈ తరుణంలో రేపు భార‌త ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ అక్కడి వెళ్లి, ఆయ‌న మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. చైనా, భార‌త్‌ సరిహద్దులో భద్రతా బలగాల పరిస్థితిని ఆయ‌న‌ పరిశీలించి, ఉన్నతాధికారులతో కీలక విషయాలపై చర్చిస్తారు. తాజాగా చైనా మీడియా భారత్‌ను ఏలా తిప్పి కొట్టాలో మాకు తెలుసు అంటూ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం సుపరిచితమే.