వారణాసి: తాజాగ రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం చర్చనీయాంశం అవుతోంది. ఆమె ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగాలను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఓ కీలక ప్రకటన చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశిస్తే వారణాసి నుంచి మోదీపై పోటీ చేస్తానని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. రాజకీయంగా ప్రియాంక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.