లక్నో: ప్రభుత్వ ఉద్యోగలు విధి నిర్వహణ సమయంలో తాము పని చేసే కార్యాలయంలోనే పట్టపగలు మందు తాగుతూ విర్రవీగారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం....అలీగఢ్ సిటీ రోడ్లు, రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఆ నలుగురు ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలోనే.. ఆఫీసులోనే కూర్చుని మందు తాగుతున్నారు. ఊరికే తాగటమే కాదు.. మందు తాగుతూ తమ డ్యూటీ కూడా చేస్తున్నారు ఈ మహానుభావులు. వీరిలో ఇద్దరు ఉద్యోగులు క్యాలిక్యులేటర్ ను ముందుపెట్టుకుని లెక్కలు చేస్తుంటే ..మరొకతను వారి పక్కనే కూర్చుని టేబుల్ డ్రాలో గ్లాసులు పెట్టి వాటిలో మద్యం పోస్తున్నాడు. ఇక ఇంకో ఉద్యోగి వారి పక్కనే కూర్చుని ఎప్పుడు గ్లాసు తీసుకుందామా అన్నట్లు చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీంతో అలీగఢ్ రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. వీరిలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.