న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ అమ్మకాల రిటర్న్స్ గడువును పెంచింది. మార్చి నెలకు జీఎస్టీ అమ్మకాల రిటర్న్స్ జీఎస్టీఆర్ 3బీ దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది. జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ దాఖలు, పన్ను చెల్లింపునకు గడువు తేదీ ఏప్రిల్ 20. ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడిగించింది. మరో మూడు రోజుల సమయం ఇచ్చింది.