శ్రీలంక ప్రజలకు భారత్ అండగా ఉంటుంది

SMTV Desk 2019-04-21 16:59:23  Modi

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు పలు చోట్ల జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనను పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఈ ప్రాంతంలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చేస్తామని తెలిపారు. ఈ సమయంలో శ్రీలంక ప్రజలకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అదేవిధంగా బాధిత కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. పేలుళ్ల సమాచారంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని భారత రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. కాగా దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ కూడా దాడుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తీవ్ర వాదానికి సరిహద్దులు లేవని.. అన్ని దేశాలు కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.