జైపూర్: రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక బ్యాట్స్మన్గా ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ త్వరలో జట్టుకు దూరం కానున్నాడు. బట్లర్ భార్య లౌసీ పురిటి నొప్పులతో ఇంగ్లాండ్లోని ఓ ఆసుపత్రిలో చేరింది. త్వరలోనే తండ్రి కాబోతున్న నేపథ్యంలో బట్లర్ తనకు పుట్టబోయే బిడ్డను చూసుకునేందుకు ఇంగ్లాండ్కు పయనమయ్యాడు. ఈ కారణంతోనే ముంబయి ఇండియన్స్తో మ్యాచ్లో ఆడలేదు. నిజానికి బట్లర్ ఈ నెల మొత్తం జట్టుతోనే ఉండాల్సి ఉంది. రాజస్థాన్ తరఫున 38.87 సగటుతో 311 పరుగులు చేసి అందరి కంటే ముందున్నాడు. స్ట్రైక్రేట్ కూడా 150కి పైనే ఉంది. అయితే, బట్లర్తో పాటు ఏప్రిల్ 23న మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు కూడా జట్టును వీడనున్నారు. దిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్ తర్వాత బెన్ స్టోక్స్, జోఫ్రా అర్చర్ కూడా స్వదేశం పయనం కావాల్సి ఉంది. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న ఈ ముగ్గురూ జట్టును వీడనుండటం ఆ జట్టును కలవరపెడుతోంది.