వెండితెర ఒక్కటే కాదు. బుల్లితెర, వెబ్ సిరీస్ లోనూ నటించేందుకు సినీ స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా త్వరలోనే బుల్లితెరపై మెరవనుంది. దానికి సంబంధించిన ప్రోమోని కలర్స్ టీవీ ఛానెల్ విడుదల చేసింది. ఐతే, నయన్ పాల్గొనబోయే ప్రొగ్రామ్ ఏంటన్నది సస్పెన్స్ గా ఉంచింది. బహుశా.. నయన్ ఓ డ్యాన్స్ షోకి గెస్ట్ రావొచ్చని చెబుతున్నారు.
నయన్ తన సినిమాల ప్రమోషన్స్ కి కూడా హాజరు కాదు. అలాంటిది ఓ టీవీ షోకి రావడం గొప్ప విషయమే. ప్రస్తుతం నయన్ మెగాస్టార్ చిరంజీవి సైరా లో నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ లోనూ నయన్ నే హీరోయిన్. ఈ చిత్రానికి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు.