త్రిపుర, ఆగస్ట్ 19: ప్రజలకు రోజురోజుకు సామాజిక మాధ్యమ వేదికలపై ఆకర్షణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సామాజిక మాధ్యమాలు సంచలనాలకు వేదికలగా మారాయి. ఇటీవల ఓ యువకుడు కేంద్ర మంత్రికి సినిమా నచ్చ లేదంటూ ట్వీట్ చెసిన విషయం విదితమే. తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తలను తెచ్చిన వ్యక్తికి 5.5 లక్షల రూపాయలు బహుమానం అంటూ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తుంది. కాగా ఈ పోస్ట్ చేసిన వ్యక్తి తాను వామపక్ష వ్యతిరేక మండలి కార్యకర్తగా ప్రకటించుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇండోర్ నుంచి ఈ పోస్టు పెట్టినట్టు గుర్తించారు.