మోదీని ఓ పనికిమాలిన వాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సిద్దూ

SMTV Desk 2019-04-21 15:40:56  Siddu modi,

ఎన్నికల సమయంలో నేతలు మాటలకు హద్దు అదుపు లేకుండా పోతింది. విమర్శలు, ప్రతివిమర్శలలో ఘాటు పెంచి దూషణలకు దిగుతున్నారు. ఏకంగా వ్యక్తిగత విషయాలని ఉద్దేశిస్తూ కొందరు వ్యాఖ్యనిస్తుంటే మరికొందరు పదవులకి కూడా గౌరవం ఇవ్వకుండా వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటికి రెండు విడతల ఎన్నికలు పూర్తికాగా మూడవ విడతకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్-బీజేపీ నేతలు ఒకరి మీద మరొకరు తీవ్రంగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రధాని నరేంద్ర మోదీని ఓ పనికిమాలిన వాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐదేళ్ల పాలనతో మోదీ ప్రైవేటు వ్యక్తులకు మేలు చేయడం ద్వారా జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబానీలకు, అదానీలకు మోదీ ఓ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారని, ‘మోదీ ఓ నికమ్మా’ (పనికిమాలినవాడు) అంటూ పరుషపదజాలంతో విమర్శించారు. జాతీయతా భావం పేరుతో ఓట్ల రాగం ఆలపించడం మానేసి జాతి ప్రయోజనాల గురించి మాట్లాడాలని మోదీకి హితవు పలికారు.