బీజింగ్: చైనాలో జరుగుతున్న కున్మింగ్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి తొలిసారి భారత మాజీ ఛాంపియన్, టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ సంవత్సరం మూడు ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో పాల్గొన్న ప్రజ్నేశ్ రెండింటిలో సెమీస్ చేరుకున్నాడు. మరో టోర్నీలో రెండో రౌండ్లో ఓటమిని ఎదుర్కొన్నాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రజ్నేశ్ 7-6 (7/5), 6-7 (3/7), 6-4తో పోలాండ్కు చెందిన ఆటగాడు కామిల్ మజార్జక్పై గెలుపొందాడు. 2 గంటల 48 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో చివరకు ప్రజ్నేశ్ విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జే క్లార్క్ (బ్రిటన్)తో టైటిల్ పోరుకు సిద్దమయ్యాడు.