యూఎఇ: అబుదాబిలో వేలాదిమంది భారతీయుల సమక్షంలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బోచసన్ వాసి శ్రీ అక్షర్–పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ అధిపతి మహంత్ స్వామి మహారాజ్ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి–దుబాయ్ హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా బీఏపీఎస్ ఈ ఆలయాన్ని యూఏఈతో కలిసి నిర్మిస్తోంది. ఇందులో ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు నిర్వాహకులు.