న్యూఢిల్లీ: శ్రీలంక దేశంలో వరుస బాంబు పేలుళ్ళ సంఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. పేలుళ్లపై భారత హైకమిషనర్తో మాట్లాడినట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నామన్న ఆమె..బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇక శ్రీలంకలోని భారత రాయభార కార్యాలయం భారత పౌరుల కోసం హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ పేలుళ్ళలో 50మందికి పైగా మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు.