శ్రీలంక: వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దేశం ఒక్కసారిగా దద్దరిల్లింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే వారిని లక్ష్యంగా చేసుకుని...ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కొద్ది సమయంలోనే దాదాపు మూడు చర్చిల్లో పేలుళ్లు జరిపారు. అంతేకాకా మరో రెండు స్టార్ హోటళ్లలో బాంబు దాడి చేశారు. కొలంబోలోని కొచ్చికాడోలోని సెయింట్ ఆంటోనీ చర్చిలో బాంబు పేలింది. తర్వాత కథువాపితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో మరో పేలుడు జరిగింది. అనంతరం బట్టికాలోవ చర్చిలో మరో పేలుడు జరిగిందని పోలీసులు నిర్ధారించారు. శ్రీలంక మీడియా కథనాల ప్రకారం 30 మందికి పైగా మృతి చెందినట్లు వెల్లడించింది. ఘటనా స్థలంలో 200 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారి సంఖ్యతో పాటు పదుల సంఖ్యలో మృతులున్నట్లు.. పోలీసులు తెలిపారు. పేలుళ్లు జరిగిన చర్చిల్లో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.