జైపూర్: ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అజింక్య రహానేను కేప్టన్సి బాధ్యతల నుండి తొలగించి అతని స్థానంలో సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు బాధ్యతలు అప్పగించారు. శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్కు స్మిత్ కెప్టెన్గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్లోనే రాజస్థాన్ ఘన విజయం సాధించడం విశేషం. రహానెను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఖాయమని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఊహించిందే జరిగింది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి బాల్ ట్యాంపరింగ్కు పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్స్మిత్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. రహానె 8 మ్యాచుల్లో కెప్టెన్గా వ్యవహరించగా రాజస్థాన్ ఆరింటిలో ఓటమి పాలై కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది.