యూపీ సీఎం ఆదిత్య నాథ్‌ను చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్

SMTV Desk 2017-08-19 10:53:45  UP Chief Minister, Yogi adityanath, Prank call, Police control room, Delhi, Anti Terrorist squad

ఢిల్లీ, ఆగస్ట్ 19: ఇటీవల ఢిల్లీ హైకోర్టులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు కలకలం సృష్టించిన వదంతు మరవక ముందే యూపీ సీఎం ఆదిత్య నాథ్‌ను చంపేస్తామని అంటూ ఫోన్ రావడం తీవ్ర సంచలనం కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ను హతమారుస్తామని, పోలీసులకు గంట సమయం ఇస్తున్నామని, ఆయనను కాపాడుకోవాలంటూ ఢిల్లీలోని పోలీస్ కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ నంబర్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో హుటాహుటిన కంట్రోల్ రూమ్ సిబ్బంది ఆ ఫోన్ నంబర్ వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా, అది ఇంటర్నెట్ కాల్‌గా తేలింది. కాగా, ఫోన్ చేసిన ఆగంతుకుడెవరో తెలియలేదు. ఈ కేసు దర్యాప్తును యూపీ యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ (ఏటీఎస్) కు అప్పగించారు.