ఘజియాబాద్ లో దారుణం .. డబ్బు కోసం తల్లిని...

SMTV Desk 2019-04-20 16:33:25  Murder

లక్నో : డబ్బు కోసం ఓ కొడుకు తన్న కన్నతల్లిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన యుపిలోని ఘజియాబాద్ లో గురువారం జరిగింది. ఆలస్యంగా శనివారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఘజియాబాద్ కు చెందిన రామ్ర్తి(66) అనే వృద్ధురాలికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె పెద్ద కొడుకు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి ప్లాస్టింగ్ కోసం తల్లిని లక్ష రూపాయలు ఇవ్వాలని కోరాడు. డబ్బు ఇచ్చేందుకు తల్లి రామ్ర్తి నిరాకరించింది. దీంతో పొలం వద్ద పనులు చేస్తున్న రామ్ర్తిపై ఇటుకలతో దాడి చేసి చంపేశాడు. అనంతరం రామ్ర్తి మృతదేహాన్ని సమీప అటవీ ప్రాంతంలో పడేశాడు. తల్లి రామ్ర్తి కనిపించడం లేదని తన తమ్ముడికి చెప్పాడు. దీంతో రామ్ర్తి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా సమీప అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి విచారణ చేశారు. ఈ నేపథ్యంలో తానే తన తల్లి రామ్ర్తిని చంపినట్టు ఆమె పెద్ద కొడుకు పోలీసుల ఎదుట అంగీకరించాడు. పోస్టుమార్టం కోపం రామ్ర్తి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.