రాయచూర్ ఘటన పై రష్మిక ఎమోషనల్ ట్వీట్

SMTV Desk 2019-04-20 15:31:41  rashmika, rashmika mandanna, raychur rape

టాలీవుడ్ లోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక... విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం సినిమాతో హిట్ అందుకుంది. దాంతో అస్సలు తగ్గేదే లేదంటూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతూ.. బిజీ అయిపోయింది. అయితే ఆ తర్వాత తన సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ అయిపోయింది.

తాజాగా రాయచూర్ అడవుల్లో ఇంజనీర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రగడ జరుగుతోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అంతా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై రష్మిక కూడా స్పందించింది.

రష్మిక ఏమన్నదంటే... మనుషుల్లో మానవత్వం ఎక్కడుంది. రాయచూర్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మధుపై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నా గుండెను ముక్కలు చేసింది. ఇంకా ఎంత మంది ఇలాంటి వాటి బారిన పడాలి?. ఆమెకు న్యాయం జరగాలని.. ఇదే చివరి దుర్ఘటన కావాలని ఆశిస్తున్నా అంటూ ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు.