బ్యాంకు ఉద్యోగుల సమ్మె..!

SMTV Desk 2017-08-18 16:56:08  kolkata, private bank sectors, Bank employees strike.

కోల్‌కతా, ఆగస్ట్ 18 : దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సంస్కరణలు.. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాల ద్వారా పటిష్టీకరణ(కన్సాలిడేషన్)కు వ్యతిరేకంగా ఈ నెల 22న బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మె తలపెట్టనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒకే ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ పరిధిలోకి తేవడానికి ప్రభుత్వం బ్యాంక్‌ బోర్డు బ్యూరోని ఏర్పాటు చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వాటి ఈక్విటీలో ప్రభుత్వ వాటాను 50% లోపు తీసుకురావాలన్నది దాని ఉద్దేశమని విమర్శించారు. 6.83 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న పీఎస్ బీల మొండి బకాయిల కోసం కేటాయింపులు జరుపుతు౦డడంతో వాటి ఆర్ధిక పరిస్థితే ప్రమాదంలో పడిందని ఆందోళన చేస్తున్నారు.