ఎన్డీ తివారీ కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా ?

SMTV Desk 2019-04-20 10:39:15  ND tiwari,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, దివంగత కాంగ్రెస్ నేత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ తివారీ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదిస్తున్నారు. అతనిది సహజ మరణం కాదని, ఎవరో హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అతని ముఖంపై దిండులాంటి వస్తువును అదిమిపెట్టి చంపారని తేలింది. దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై హత్యకింద కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్ ఈ నెల 15న ఇంటికి వచ్చి మద్యం తాగాడు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ లేవలేదు. దీంతో సాయంత్రం 4 గంటల సమయంలో విగతజీవిగా కనిపించాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. రోహిత్ ముక్కు నుండి రక్తం కారింది. అయితే రోహిత్‌ది సహజ మరణమేనని అతని తల్లి ఉజ్వల చెబుతుండడంతో కేసుపై గందరగోళం నెలకొంది.