‘మహర్షి’ మూవీ నుంచి మూడో పాట

SMTV Desk 2019-04-20 10:21:55  Maharshi,

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీ నుంచి మూడో పాట వచ్చింది. ‘ఎవరెస్ట్ అంచునా’ అంటూ సాగే మూడో పాటను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. వినడానికి క్యాచీగా ఉన్న ఆ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం బావుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరీ కొత్తగా లేనప్పటికీ.. ఫర్వాలేదనిపిస్తోంది. ఇక ఈ పాటలో మహేశ్ ఎప్పటిలాగే అందంగా కనిపించగా.. పూజా హెగ్డే తన అందంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.



కాగా మహేశ్ బాబు ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం మే9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.