వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2019-04-19 18:30:49  varun gandhi,

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, తన సోదరుడైన రాహుల్ గాంధీపై దివంగత సంజయ్ గాంధీ తనయుడు బీజేపీ నేత, పిలిభిత్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీకి వచ్చే రెండు దశాబ్దాల్లోనూ ప్రధాని అయ్యే అవకాశం లేదని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ప్రధాని నరేంద్ర మోదీకి సరితూగే నాయకుడే లేరని చెప్పుకొచ్చారు. ఈక్రమంలో వచ్చే పది, ఇరవై ఏళ్లలోనూ రాహుల్ ప్రధాని కాలేరని బలంగా చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదికి జనం ఓట్లు మాత్రమే కాదు.. వారి రక్తం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తితో రేకిస్తున్నాయి. వరుణ్ గాంధీ తన తల్లి మేనకా గాంధీ బీజేపీలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే