ఆయన్ని నమ్ముకుంటే జాతీయ నేతలు కూడా మునుగుతారు

SMTV Desk 2019-04-19 15:25:50  chandrababu

ఈవీఎంలపై ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. 2014లో ఎలా గెలిచారో కూడా చెప్పాలని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్లే నంద్యాలలో విజయం సాధించారా..? అన్నది ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈవీఎంపై రచ్చ చేస్తూ చంద్రబాబు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారని.. ఆయన్ని నమ్ముకుంటే జాతీయ నేతలు కూడా మునుగుతారు అంటూ శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.