ముంబై చేతిలో ఢిల్లీ చిత్తు

SMTV Desk 2019-04-19 12:17:30  Mumbai, Delhi,

న్యూఢిల్లీ: ఐపిఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఫిరోజ్‌షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్‌ ఘనవిజయం సాధించింది. ముంబయి జట్టు నిర్దేశించిన 169 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. దీంతో ముంబయి, ఢిల్లీపై 40 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు శిఖర్‌ధావన్‌(35), పృథ్వీషా(20), అక్షర్ పటేల్(26)లు ఫర్వాలేదనిపించినా… మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ఢిల్లీ ఓటమిపాలైంది.

ముంబయి బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు పడగొట్టగా..బుమ్రా, మలింగ, హర్దిక్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(30), డికాక్(35), సూర్య కుమార్ యాదవ్(26)లు రాణించారు. చివర్లో హార్దిక్ పాండ్య (32), కృనాల్ పాండ్య‌ (37) దూకుడుగా ఆడటంతో ముంబయి ఇండియన్స్ మంచి స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.