టాలీవుడ్ హీరో మహేష్ బాబు పూజా హెగ్డే కలిసి నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకుని ధియేటర్లకు రాబోతుంది. ఈ విషయాన్ని మహేశ్.. సోషల్మీడియా ద్వారా వెల్లడిస్తూ ‘మహర్షి.. ఇట్స్ ఎ ర్యాప్’ అని కేక్పై రాసున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘మిమ్మల్ని మే 9న థియేటర్లలో చూస్తాను’ అని క్యాప్షన్ ఇచ్చారు.దిల్ రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తం నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర పోషించారు. మే9న సినిమా రిలీజ్ కాబోతుంది.
మరోవైపు ఈ సినిమాలో ‘ఎవరెస్ట్ అంచున’ అని సాగే పాట వీడియో ప్రివ్యూను శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నారు. ‘మహర్షి’ తర్వాత మహేశ్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.