హైదరాబాద్: తెలంగాణ బోర్డు ఇంటర్మీడియెట్ ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్రెడ్డి సాయంత్రం 5 గంటలకు వెలువరించారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో 59.8 శాతం, రెండో సంవత్సరంలో 65 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
1. http://www.bie.telangana.gov.in/,
2. https://www.manabadi.com/,
3. http://results.cgg.gov.in/ ,
4. bie.tg.nic.in