అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పలు శాఖలపై సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడాన్ని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తప్పుబట్టారు. బుధవారం నాడు చంద్రబాబు అమరావతిలో పోలవరం ప్రాజెక్టు పనుల పురుగోతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షతో పాటు తాగునీటి సమస్య ఇతర సమస్యలపై ఆయన సమీక్ష చేశారు. అయితే ఈ సమీక్షలపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. విమర్శలు కూడ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసీ గురువారం నాడు స్పందించింది. అధికారులతో సమీక్షలు నిర్వహించడం, వీడియో కాన్పరెన్స్లు నిర్వహించడం కూడ ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తోందని ఈసీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికారులు ఏం చేయాలనే విషయమై మరోసారి అధికారులకు గైడ్లైన్స్ను ఈసీ పంపింది. ఇదిలా ఉంటే గురువారం నాడు రాష్ట్రంలో హోం శాఖపై చంద్రబాబునాయుడు నిర్వహించాల్సిన సమీక్షను రద్దు చేసుకొన్నట్టు సమాచారం.