పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత

SMTV Desk 2019-04-18 16:00:48  West bengal.

పోలింగ్ వేళ పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత నెలకొంది. రాయ్‌ గంజ్‌ లో పోలింగ్‌ కేంద్రాల వద్ద అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.