పోర్చుగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మడైరాలో పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సుబోల్తా పడి 29 మంది మృతి చెందారు. ఘటనా స్థలిలో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతులంతా జర్మనీ దేశానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారంటున్న అధికారులు.. మృతుల మరింత సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.