చించోలిలో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు

SMTV Desk 2019-04-18 11:20:46  chincholi constituency, assembly elections 2019, Chincholi Assembly bypoll on May 19

కర్ణాటక: మే 19న చించోలి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయడానికి ఏప్రిల్‌ 29 చివరి తేదీ కాగా.. మే 23న ఓట్ల లెక్కింపు జరుగనుంది. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంఎల్ఎ ఉమేశ్‌ జాదవ్‌ రాజీనామా చేయడంతో చించోలి అసెంబ్లీ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఉమేశ్‌ జాదవ్‌ బిజెపి అభ్యర్థిగా గుల్‌బర్గా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టుగా సమాచారం.