రెండో దశ పోలింగ్ కు యూపి సిద్దం

SMTV Desk 2019-04-17 18:35:02  loksabha elections, uttarpradesh

లక్నో: దేశంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా గురువారం రోజు రెండో దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో యూపిలో 8 స్థానాలుంటే ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ, మధుర, హథ్రాన్‌, బులంద్‌ సహర్‌, ఆమ్రోహా, నగీనా ,అలీగఢ్‌ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కేంద్రాలకు ఈవిఎంలను పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పారా మిలిటరీ బలగాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతను పెంచారు. మొత్తం దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్‌ జరగనుంది. ఈ రెండో విడతలో 97 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంటే..దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడులో మొత్తం 54 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఉత్తరాదిన 11 రాష్ట్రాల్లో 43 స్థానాలకు రేపు పోలింగ్‌ జరగుతుంది.