బిజెపి తీర్థం పుచ్చుకున్న సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌

SMTV Desk 2019-04-17 15:47:25   Sadhvi Pragya Singh Thakur, BJP, LOKSABHA ELECTIONS, Sadhvi Pragya Singh Thakur JOINS BJP

భోపాల్: సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ తాజాగా బిజెపి తీర్థం పుచ్చుకున్న్నారు. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ మాజీ సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, బిజెపి సీనియర్ నేతలు రామ్‌లాల్‌, ప్రభాత్‌ జాతో సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మీడియతో మాట్లాడిన ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ తానూ బిజెపి లో చేరినట్లు ప్రకటించింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తాను గెలిచి తీరుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. భోపాల్‌ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత దిగ్విజయ్‌ సింగ్‌పై సాధ్వి ప్రగ్యా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భోపాల్‌లో 1989 నుంచి 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ విజయం సాధించ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మిగతా ఐదు నియోజకవర్గాల్లో బిజెపి గెలిచింది. 2008లో జరిగిన మాలేగావ్‌ పేలుళ్ల ఘటనలో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రగ్యాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మాలేగావ్‌ కేసును ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు విచారణ చేస్తోంది.