రెండు రోజుల నుంచి ఆగని భారీ వర్షాలు....32 మంది మృతి

SMTV Desk 2019-04-17 15:43:35  madhyapradesh, gujarath, rajastan, high rains, 32 people died

న్యూఢిల్లీ: గత రెండు రోజుల నుంచి నిర్విరామంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా అనేక మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఆరుగురు చనిపోయారు. గుజరాత్‌లో 10 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు కురియడంతో 16 మంది మృతి చెందారు. ఈదురుగాలులు, వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా పై మూడు రాష్ట్రాల్లో విద్యుత్‌, రవాణా సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ప్రధాని నరేంద్రమోడీ నష్టపరిహారం ప్రకటించారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మోడీ హామీ ఇచ్చారు.