ఎస్పిలోకి పూనమ్‌ సిన్హా

SMTV Desk 2019-04-17 14:23:27  samajwadi party, loksabha elections, akhilesh yadav, dimple yadav, poonam sinha, shtragnu sinha

ముంబై: ప్రముఖ సినీ నటుడు శతృఘ్నసిన్హా భార్య పూనమ్‌ సిన్హా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు డింపుల్‌ యాదవ్‌. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌పై ఎస్పి-బిఎస్పీ కూటమి అభ్యర్థిగా పూనమ్‌ సిన్హా పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి రాజ్‌నాథ్‌ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. శతృఘ్నసిన్హా కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌పై పాట్నా సాహిబ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్నారు.