అతి తక్కువ ధరలో శాంసంగ్ గెలాక్సీ ఎ2 కోర్‌

SMTV Desk 2019-04-16 17:46:58  samsung, samsung galaxy a2 core

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ మొట్టమొదటి సారి అతి తక్కువ ధరతో కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. గెలాక్సీ ఎ2 కోర్‌ పేరుతో, ఆండ్రాయిడ్‌ గో ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి శాంసంగ్‌ ఆవిష్కరించింది. దీని ధర 5290 రూపాయలు సంస్థ నిర్ణయించింది.అయితే, షావోమి తీసుకొచ్చిన రెడ్‌మి గో ధర రూ. 4499. అలాగే రెడ్‌మి గో లో 8 ఎంపి రియర్‌ కెమెరాను పొందుపర్చగా, బ్యాటరీ సామర్ధ్యం 3000 ఎంఎహెచ్‌ గా ఉండటం విశేషం.

ఫోన్ ప్రత్యేకతలు:5 అంగుళాల డిస్‌ప్లే, 960×540 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
1. 6 ఆక్టాకోర్ ప్రాసెసర్‌, 7870 సాక్‌
1జిబి ర్యామ్‌, 16జిబి స్టోరేజ్‌
256 దాకా పెంచే అవకాశం
5 ఎంపి రియర్‌ కెమెరా, 5 ఎంపి సెల్ఫీ కెమెరా
2600 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.