నన్ను గోకారంటే మాత్రం ఏమైనా చేస్తా : రోజా

SMTV Desk 2019-04-16 15:45:05  mla roja, ysrcp, mla, roja

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా ఓ తెలుగు టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నేను ఎమ్మెల్యెగా ఎందుకు ఎన్నికయ్యానా? అని తనకు అనిపించిందని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు మజ్లిస్, కమ్యూనిస్టులు, ఇతర పార్టీల నేతలతో అసెంబ్లీకి నిండుతనం ఉండేదనీ, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాక ఉన్న ఆసక్తి కాస్తా పోయిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కాలంలో సభాసంప్రదాయాలు పూర్తిగా మంటకలిసి పోయాయని అన్నారు.అప్పట్లో అసెంబ్లీలో సభ్యులు హుందాగా మాట్లాడేవారనీ, వారి నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించేదని రోజా తెలిపారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే అరుస్తూ, గోలచేస్తూ వారిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా సభ్యులు సహనం కోల్పోయేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీలో వైఎస్‌ఆర్‌సిపి ఏకైక ప్రతిపక్షంగా మారిపోవడంతో ఏమిటి వీళ్లకు గౌరవం ఇచ్చేది? సభలో మాకే బలం ఉంది. బిల్లులను మేం పాస్ చేసుకుంటాంగ అనే నిర్లక్ష్యం ప్రభుత్వానికి వచ్చేసిందని అభిప్రాయపడ్డారు. మంచిగా మాట్లాడితే ఎంతసేపయినా నేను సబ్జెక్ట్ పైన మాట్లాడుతా. కానీ నన్ను గోకారంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్తా, ఏమైనా తిడతా అని అది ఆరోజు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చూపించాను. అని రోజా తెలిపారు.