న్యూఢిల్లీ: గత ఐపీఎల్ సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దూసుకుపోతోంది. ఆదివారం నాడు సన్రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ల మధ్య జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ 39 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టు ఈ సారి టైటిల్ కొట్టేందుకు సిద్ధంగా ఉందని, ఆ సామర్ధ్యం జట్టుకు ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితే ఛాంపియన్గా నిలవడానికి ఎంతో దూరంలో లేము అని పేర్కొన్నాడు. పెద్ద భాగస్వామ్యాలు విజయం అందిస్తాయని, తమ జట్టులో ఉన్న ఆటగాళ్లంతా చాల మంది ఒకే వయసు గల వారని అన్నారు. అండర్ -19 క్రికెట్లోనూ కలిసి ఆడిన అనుభవం ఉంది. కీలక బౌలర్గా మారిని రబాడా కూడా మాతో ఎంతో క్రికెట్ ఆడాడు. కాబట్టి మా మధ్య సమన్వయ భారం ఎక్కువగా ఉందన్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.