మిశ్రమంగా కదలాడిన ఇంధన ధరలు

SMTV Desk 2019-04-16 15:35:58  Petrol, Deseal, Price, New delhi

సోమవారం దేశీయ ఇంధనం ధరలు మిశ్రమంగా కదిలాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 6 పైసలు పైకి ఉండగా డీజిల్ ధర స్థిరంగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.98 వద్ద, డీజిల్ ధర రూ.66.26 వద్ద కొనసాగుతున్నాయి. ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.77.39 వద్ద, డీజిల్ ధర రూ.71.99 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.77.11 వద్ద, డీజిల్‌ ధర రూ.71.37 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.74, డీజిల్ ధర రూ.71.03 వద్ద కొనసాగుతోంది.