రాయ్ పూర్: చత్తీస్ గఢ్ లో అక్రమాలతో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా ఏకంగా అసిస్టెంట్ కలెక్టర్ ని చంపేదాక వెళ్ళింది. అక్రమ మైనింగ్ కు అడ్డు వస్తున్నాడనే కోపంతో ట్రైనీ కలెక్టర్ మయాంక్ చతుర్వేదిని జేసీబీతో తొక్కించి చంపాలని చూశారు. పూర్తి వివరాల ప్రకారం...రాయ్ గర్ జిల్లాలో పెద్ద ఎత్తున గ్రానైట్, డొలమైట్ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ చతుర్వేదికి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన మయాంక్ అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి, విచారణకు ఆదేశించారు. అదే సమయంలో మైనింగ్ మాఫియా లీడర్ అమ్రిత్ పటేల్ తన అనుచరులతో అక్కడికి వచ్చాడు. అసిస్టెంట్ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు తన అనుచరుడికి సైగ్ చేసి జేసీబీతో చతుర్వేది కారుని తొక్కించి చంపేయాలని ఆదేశించాడు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. పరారీలో ఉన్న పటేల్, అతడి అనుచరుల కోసం గాలిస్తున్నారు.