హైదరాబాద్: నేడు ఢిల్లీతో హైదరాబాద్ జట్టు తలపడనుంది. వరుస ఓటములు చూస్తున్న హైదరాబాద్ కు ఈ మ్యాచ్ పెద్ద సవాలుగా మారింది. ఈ సీజన్లో వరకు ఆరు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ మూడింటిలో ఓటమి పాలైంది. మూడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కిందటి మ్యాచ్లో బలమైన కోల్కతా నైట్రైడర్స్ను ఓడించి జోరుమీదుంది. స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ ఫామ్లోకి రావడం ఢిల్లీకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. హైదరాబాద్లో డేవిడ్ వార్నర్, బైర్స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. ఢిల్లీలో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. పృథ్వీషా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇంగ్రామ్, క్రిస్ మోరిస్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కిందటి మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ధావన్ ఈసారి కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. పంత్ కూడా గాడిలో పడడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇక, పృథ్వీషా, అయ్యర్లు కూడా బాగానే ఆడుతున్నారు. రబడా, అక్షర్ పటేల్, ఇషాంత్, మోరిస్లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది.