హైదరాబాద్, ఆగస్ట్ 17 : ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేశుని విగ్రహాల వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ తరఫున మట్టి గణేశుడి విగ్రహాలను అమ్ముతున్నట్లు వెల్లడించారు. "మనందరికీ గణేశుడంటే ఇష్టం. అలాగే అందరికీ ఇష్టమైన వినాయకుడు ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటాడని కచ్చితంగా చెప్పగలను. జై మట్టి గణపతి" అంటూ ట్విట్ చేసారు. దీనికి సంబంధించిన ప్రచార వీడియోను కూడా ఆయన షేర్ చేసారు.