ముంబై, ఆగస్ట్ 16: మొదటి నుండి బడ్జెట్ ధరలలో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్న స్వైప్ సంస్థ తాజాగా మరో 4జీ స్మార్ట్ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బ్లాక్, గోల్డ్, గ్రే కలర్లలో ఆన్ లైన్ వాణిజ్య దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 5 ఇంచెస్ హెచ్డీ ఎఫ్డబ్ల్యూవీజీఏ డిస్ప్లే, 8 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 64 జీబీ వరకు విస్తరణ మెమరీ, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. స్వైప్ ఎలైట్ 4జీ పేరుతో విడుదలైన ఈ ఫోన్ రూ.4,000 లభిస్తుంది. అయితే యాక్సిస్ బ్యాంకు బుజ్ కార్డ్ హోల్డర్స్ తో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపును కూడా పొందవచ్చును.