మంగళవారం లాభాల్లో తేలిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. మొదట మార్కెట్లు మందకొడిగా సాగినా చివర్లో భారీ నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయి, 38,573 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 11,587 వద్ద ముగిశాయి. అయితే హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా పతనం కావడంతో మార్కెట్ కుంగింది. ప్రజ్ ఇండస్ట్రీస్ షేర్లు 8శాతం లాభపడి రూ.149 మార్కును తాకాయి. మరోపక్క యూరప్అమెరికా మధ్య ట్రేడ్వార్ మరోసారి భగ్గుమనడం కూడా మార్కెట్ భయాలకు కారణమైంది.